చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మహాదేవమంగళం గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు కే వెంకటేశ్వర రెడ్డి (65) ఆదివారం సాయంత్రం పడిన అకాల వర్షం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న తన పొలం వద్దకు వెళ్ళాడు.
వర్షం పడుతుండడంతో పక్కనే ఉన్న చెఱకు గానుగ కొట్టంలోకి వెల్లగా పక్క పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు మీద ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడ్డది దాంతో కొట్టంతో సహా రైతు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.