సూర్యాపేట జిల్లా పరిధిలోని అరవపల్లి తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఆరుగురు సభ్యులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ ఆర్ భాస్కర్ వివరాలను వెల్లడించారు.
వీరు రెండు ముఠాలుగా ఏర్పడి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారి వద్ద నుండి 2.92 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, ఒక ఇరిటీగా కారు, 1 ద్విచక్య వాహనం,7 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీటి విలువ సుమారు 70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.