ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఒంటి పూట క్లాస్లు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ నిబంధనలు అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 2019–20 అకాడమిక్ క్యాలెండర్ ఎప్పటిలాగే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.