40.2 C
Hyderabad
April 26, 2024 13: 32 PM
Slider ఆధ్యాత్మికం

14న ముగియనున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

#LordBalaji

లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌ అక్టోబరు 14న బుధవారం ముగియనుంది.

తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది.

“రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః ” అనే మహామంత్రం ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. 

ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి ఒక గంట పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. 

వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Related posts

పుష్యరాగం

Satyam NEWS

అంబర్ పేట్ లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

ఆత్మహత్యా ప్రయత్నం చేసిన చిట్యాల సీఐ

Satyam NEWS

Leave a Comment