మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గల ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహం నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న హెచ్ సునీత అగ్ని వీర్ మహిళా పోలీస్ విభాగం నందు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అనితను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు వి. పాండు, వసతి గృహ సంక్షేమ అధికారి స్వప్న ప్రియ పాల్గొన్నారు.
previous post