ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి, చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదం పైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రును ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబందించిన తీరును నాయకులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.