35.2 C
Hyderabad
April 27, 2024 13: 19 PM
Slider జాతీయం

జగన్ లేఖపై సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఖండన

Supreme court dismissed lea

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్న ఆ లేఖ ముఖ్యమంత్రి రాయడం సబబు కాదని వారు అన్నారు. ఇది న్యాయవ్యవస్థ పవిత్రతను మంటగలిపే విధంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగంలో అత్యంత విలువైన న్యాయ వ్యవస్థపై ఈ విధంగా బురద చల్లడం అదీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తిపై చేయడం కరెక్టు కాదని వారు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ముఖ్యమంత్రి జగన్ లేఖను తప్పు పట్టిన విషయం తెలిసిందే.

Related posts

కర్కశ పోలీసుల చేతుల్లో నలిగిపోయిన పిల్లాడు

Satyam NEWS

మూడు రాజధానుల కాన్సెప్టుకు మేం వ్యతిరేకం

Satyam NEWS

యునెస్కో గుర్తింపుపై తెలంగాణ జాగృతి హర్షం

Satyam NEWS

Leave a Comment