వనపర్తి పట్టణంలో ఒక భూమి కేసులో హైకోర్టు రిట్ ఫిటీషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఈ నెల 2న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ అప్పీల్(సి)నంబర్ 21809/2022 పై న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణమురారి,వి.సుబ్రమణియన్ విచారణ చేశారు.వనపర్తి గ్రూప్ అఫ్ టెంపుల్స్ ఇ.ఓ. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.28-11-2022 నాడు ఫైల్ చేశారు.డైరీ నంబర్ 38553/2022.అక్టోబర్ 29న వెరిఫై చేశారు.
సుప్రీం కోర్టు హల్ నంబర్ 14లో విచారణ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్, మహబూబునగర్, వనపర్తి ఆర్డీవోను, మొత్తం 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు.ప్రతివాదులకు నోటీసు జారీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. భూమిపై స్టేటస్ కో మెయింటన్ చేయాలని ఆర్డర్ లో ఉంది.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్