ఈనెల 23 న మధ్యాహ్నం 2 గంటలకు వనపర్తి పరిధిలోని నాగవరం సమీపంలో ఉన్న పద్మావతి శ్రీనివాస గార్డెన్ లో సర్పంచుల సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సదస్సుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు హాజరవుతారని ఆమె తెలిపారు.
ఈ సదస్సుకు జిల్లాలోని జడ్పిటిసిలు, ఎంపిపి లు అందరూ హాజరు కావాలని ఆమె కోరారు.