29.7 C
Hyderabad
April 29, 2024 10: 28 AM
Slider విశాఖపట్నం

34 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

#34 militiamembers

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట 34 మంది మీలిషియా సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ పెద్దబాయలు ఏరియా కమిటీ కు చెందిన కిలో ఇందు గెమ్మెలి భారతి ఉన్నారు. ఆమెపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

ఆమెతో పాటు 34 మంది ఆర్మాండ్ మీలేషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఎస్ పి తెలిపారు. తమ సిబ్బంది రెండు నెలలుగా చేస్తున్న ప్రయత్నం ఫలించిందని, అందుకు కృషి చేసిన అధికారులను సిబ్బందిని ఎస్పి అభినందించారు.

మాయమాటలకు లొంగి నక్సల్స్ దళాలలో చేరవద్దని జీవితంలో వెలుగు నింపే జనజీవన స్రవంతి లోనే ఉండాలని ఆయన కోరారు. లొంగిపోయిన వారి వద్ద నుంచి పేలుడుకు సంబంధించిన టిఫిన్ బాక్సులు పేలుడుకు ఉపయోగించే వైర్లు వెళ్తారా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

బీజేపీ వైఖరికి నిరసనగా కొల్లాపూర్ లో టీఆర్ఎస్ ధర్నా

Satyam NEWS

గంటలోపే ఆభరణాల దొంగల్ని పట్టుకున్న పోలీసులు

Bhavani

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

Satyam NEWS

Leave a Comment