కడప జిల్లా రాజంపేట శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న ఇద్దరిని బుధవారం రాత్రి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మండల పరిధిలోని బోయినపల్లి నివాసం సమీపంలో గత రాత్రి కొందరు మద్యం సేవిస్తుండగా ,హైవే పెట్రోలింగ్ రాకతో రాకతో పరుగులు పెట్టినట్టు తెలిసింది.
ఇందులో ఐదు మందిని పట్టుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురు పరారీ అయ్యినట్టు తెలిసింది. ఒకరి వద్ద తుపాకి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఎస్ పి కి సమాచారం అందించారు.
మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో కొందరు అనంతపురం, మరికొందరు పులివెందుల ప్రాంతానికి చెందినట్లు తెలుస్తుంది.
వారు అక్కడ ఎందుకు ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు, వారి వద్ద తుపాకి తో పాటు బుల్లెట్లు ఉన్నాయన్న విషయాలపై అన్ని కోణాల్లో రాజంపేట పోలీసుల విచారిస్తున్నట్లు తెలిసింది.
పట్టుబడ్డ వ్యక్తి కి కాలు కాస్త వంకర వున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎమ్మెల్యే ఇంటి సమీపంలో అనుమానితులు దొరకడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.