గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారి సారధ్యంలో సమకూర్చిన నూతన స్వచ్ఛ్ ఆటోలను బిజెపి నాయకులు నేడు ప్రారంభించారు. కాచిగూడ డివిజన్లోని బీ.జే.పి అభివృద్ధి కార్యాలయం దగ్గర కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమారమేష్ యాదవ్ సీనియర్, కన్నె రమేష్ యాదవ్ తో కలిసి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని స్వచ్చ్ నగరంగా తీర్చిదిద్దడం పరిశుద్ధ కార్మికులు పని చేస్తున్నారని, ప్రజలు తమ ఇంటి చెత్తను ఎక్కడ పడితే రోడ్లపైన వేయకూడదని అన్నారు. స్వచ్ ఆటోలోనే తడి చెత్త పోడి చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏస్ఏఫ్ఏ విష్ణు, నాయకులు భీమ్ రాజ్, నాగు, రవి యాదవ్, గణేష్, వినోద్, ఆర్.సంతోష్, రాము, దీపక్ తదితరులు పాల్గొన్నారు.