విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస లో శ్రీ స్వామి రామానంద యోగజ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ గురూజీ(అంతర్ముఖానంధ) వారి జయంతి వైభవంగా జరిగింది. శ్రావణ శుద్ద చతుర్దశి, శ్రవణం నక్షత్రాన పరమపూజనీయ శ్రీ గురూజీ జన్మించారు.
ఈ రోజు ఆ నక్షత్రం ప్రకారం శ్రీగురూజీ జన్మదినం స్వామీజీ ఆశ్రమంలో జరిగింది. ఈ సందర్భంగా తొలుత అపరవాల్మికి శ్రీశ్రీశ్రీ శివానందుల పరమహంసల వారి పీఠం వద్ద ఉన్న శ్రీ స్వామిరామానందుల వారి పాదుకలను శ్రీ గురూజీ తలపై ధరించి… స్వామీజీ సమాధి వద్ద కు వారి సతీమణి పార్వతీ అమ్మ గారితో యావత్ శిష్యగణం తో స్వామిజీ సమాధి వద్ద వారి పాదుకలను శ్రీ గురూజీ ఉంచారు. అక్కడే సద్గురు పూజ ప్రారంభమైంది.
అనంతరం స్వామిజీ సహస్రం ,శ్రీ గురుగీత అష్ఠోత్తరం ,శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, సద్గురు పాదుకాస్తవాలను పఠించారు. తదనంతరం స్వామిజీకి హారతి ఇచ్చారు.అక్కడ నుంచీ శివానంద పరమహంసల పీఠం వద్ద శ్రీగురూజీ,అమ్మ గారులతో విశాఖ నుంచీ వచ్చిన పురోహితులు శర్మ గారు గణేషుని పూజ చేయించి.. మకరతోరణానికి శ్రీ గురూజీ,అమ్మ గారులతో పూజ చేయించారు. ఈ కార్యక్రమానికి సోదర శిష్యగణంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున హాజరయ్యారు.