స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కు శిక్షణ తరగతులు నిర్వహించడానికి తగు స్థలం కేటాయిస్తామని హైదరాబాద్ అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
శిక్షణాతరగతులు నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని కోరడంతో వారికి కార్పొరేటర్ హామీ ఇచ్చారు. యువత మెరుగైన విద్యను అభ్యసించి ఇటువంటి శిక్షణలు తీసుకోవడం చాలా అభినందనీయమని కొనియాడారు.
వారికి శిక్షణ తరగతులకు అనువైన స్థలాన్ని పరిశీలించి మెరుగైన శిక్షణ అందించే విధంగా తోడ్పడుతనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాకీ బాబు, మల్లికార్జున యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.