అన్నమయ్య జిల్లా నందలూరు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన సౌమ్యనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇదో రోజు రాత్రి శ్రీ స్వామినాథ స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. అంతకు ముందు స్వామి వారు ఉయ్యాలపై కొలువు తీర్చి వేద పారాయణం, అన్నమా చార్య సంకీర్తన మంగళ వాయిద్యాలు నడుమ ఉంజల సేవ జరిగినది.
అనంతరం గరుడ వాహనంపై శ్రీ సౌమ్య నాథ స్వామిగా నందలూరు మాడవీధి ఉత్సవం జరిగినది. కోలాటాలు చెక్కభజన మంగళ వాయిద్యాలు నడుమ భక్తులు అడుగడుగునా శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి కర్పూర నీరాజనాలు పలికారు.మహా నివేదన కర్పూర హారతి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని సోమనాథ స్వామి వారి దర్శించు కున్నారు.ఈ బ్రహ్మోత్సవాలల్లో ఎంపీపీ మేడా బాస్కర్ రెడ్డి,ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ అర్చకులు సునీల్,సాయి తదితరులు పాల్గొన్నారు.