మహార్ కులస్తులకు తహసీల్దార్ ల ద్వారానే క్యాస్ట్ సర్టిఫికెట్ లను జారీ చేయాలనే డిమాండ్ తో ఈ నెల 12న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్ష నిర్వహిస్తున్నట్లు మహార్ బెటాలియన్ నాయకుడు వాగ్మారే శైలేందర్ తెలిపారు.
మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆర్డిఓ కార్యాలయం ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకుండా వెంటనే తాహసిల్దార్ ఆఫీస్ నుంచి కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని డిమాండ్ చేశారు.
మహార్ కులస్తులు ఎదుర్కొంటున్న మరి కొన్ని సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఒకరోజు శాంతియుత సామూహిక నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నామని ఈ సామూహిక దీక్షను విజయవంతం చేసేందుకు 18 మండలాల నుంచి మహర్ కులస్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కాంబ్లె దయానంద్, రాజు మస్కె , డీకె సంజయ్, ఉదయ్ రత్న జాడే, రాహుల్, బాలాజీ , రాహుల్ , అశోక్ గొవంద్ తదితరులు పాల్గొన్నారు.