ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ వైరా పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం లో చేపడుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. టాయిలెట్ బ్లాకులు, ప్రహారి గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్టేడియంలో ఆటలకు వచ్చిన సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, జెడ్పి ఉన్నత పాఠశాలల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. స్టేడియంకి ఎన్ని రోజుల నుండి వస్తున్నది, సౌకర్యాలు ఎలా ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నట్లు వారు తెలుపగా, బాలికలను ఆడవలసినదిగా కలెక్టర్ ప్రోత్సహించారు. కోచ్ ను ఏర్పాటుచేసినట్లు, మంచిగా ఆట నేర్చుకొని రాణించాలని కలెక్టర్ అన్నారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను తనిఖీ చేశారు. స్లాబ్ పూర్తయినట్లు, మిగతా పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రక్కనే వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు ముమ్మరంగా చేయాలని, త్వరితగతిన మార్కెట్ ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యటన సందర్భంలో పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, వైరా మండల తహసీల్దార్ అరుణ, మునిసిపల్ కమిషనర్ సునీత, అధికారులు తదితరులు వున్నారు.
previous post
next post