వైసీపీ పాలనతో రాష్ట్రం బ్రష్టు బట్టి పోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. టిడిపి జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు శుక్రవారం రాయచోటి పట్టణంలోని 7 వ వార్డు కొత్తపల్లిలో టిడిపి ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక వైసిపి పాలనకు నిరసగా రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి వార్డులో ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో కొనసాగిస్తున్న అవినీతి,అరాచక,నియంతృత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
previous post