అకాల వర్షాలు ఈదురు గాలుల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు యిళ్ళల్లో నుండి బయటకు రావొద్దు అని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు. చలిగాలులతో వృద్ధులు,చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. అదే విధంగా కుటుంబ సభ్యులు వృద్ధులు,పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ చైర్మన్ అన్నారు. అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్న ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఏటూరు నాగారం వెళుతుండగా తీవ్ర చలి, ఈదురు గాలులు వుండటంతో ఆయన సిబ్బంది,స్థానిక నాయకులతో కలిసి ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపైప్న టీ స్టాల్ వద్ద టీ తాగి తన ప్రయాణం ప్రారంభించారు
previous post