38.2 C
Hyderabad
April 27, 2024 16: 28 PM
Slider మెదక్

తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం సంతోషంగా ఉంది

#Minister Srinivasa Yadav

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని డెబ్బై నాలుగేళ్ళలో జరగని అభివృద్ది కేవలం ఆరేళ్ళలో జరిగిందని, ఈ విషయంలో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందని రాష్ట్ర  పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రమైన మెదక్ లోని  కలెక్టరేట్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత డెబ్బై నాలుగు సంవత్సరాల్లో జరగని అభివృద్ది కేవలం ఆరేళ్ళ కాలంలో జరిగిందన్నారు.

మెదక్ జిల్లా అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని ఈ విషయలో ప్రజలు సంతోషంగా ఉన్నారని… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

కులవృత్తుల వారికి మంచి రోజులు

గతంలో వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని… ప్రస్తుతం వరుణదేవుడు కరుణించి మంచి వర్షాలు కురుస్తున్నాయని దీంతో తెలంగాణ  వ్యాప్తంగా రైతాంగం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. కులవృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆర్థికంగా, సామాజికంగా బాగు చేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించామన్నారు.

ఇరిగేషన్ రంగంలో గతంలో ఎంతో వెనుకబడిన మెదక్ జిల్లా ప్రస్తుతం 33 శాతం పెరిగిందని… ఈ విషయంలో ఆ శాఖ అధికారుల పనితీరు ఎంతో బాగుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు సన్న బియ్యంతో విద్యార్థులకు మంచి భోజనం అందచేస్తున్నామన్నారు.

 ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత సాగు పట్ల కొందరు రాజకీయ నాయకులు రాద్దాంతాలు చేసినా రైతులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల నమ్మకంతో ఉండటం ఎంతో గర్హణీయమని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా చరిత్రలో నిలిచిపోయే పనులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అలాగే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే భయపడే రోజులు పోయేలా ఆదుకుంటుందన్నారు.

కరోనా వచ్చినా రైతులకు రైతు బంధు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతుబంధు కింద డబ్బులను వారి వారి ఖాతాల్లోకి జమచేయడంతో పాటు ఒక కోటి రెండు ఎకరాల పంట ధాన్యం కొనుగోలు చేసి ఆ డబ్బులను సైతం అందచేయడం ఎంతో గొప్పవిషయమని మంత్రి శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.

కులవృత్తులను బలోపేతం చేసేందుకు మత్స్యకారులకు చేప పిల్లలు, వాహనాలు, గొర్రెల కాపరులకు మేకలు, గొర్రెలు, చేనేత, గీత, రజక, నాయిబ్రాహ్మణులకు అవసరమైన పనిముట్లు అందచేసి వారిని అభివృద్ది పథంలో తీసుకెళ్ళడం జరిగిందని మంత్రి తలసాని వివరించారు.

పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకువచ్చామని, అలాగే ఐటీ, ఇండస్ట్రీస్ సెక్టార్లో ప్రపంచం తెలంగాణ రాష్ట్రాన్ని ధీటుగా ఉందని తెలుసుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. మెదక్ పట్టణంలోని గోసముద్రం చెరువులో చేపపిల్లను వదిలారు.

అనంతరం పట్టణంలో కరోనా ఐసోలేషన్ సెంటర్, చిల్డ్రన్స్ పార్కు వద్ద నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్పర్సన్ హేమలత, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ చందనాదీప్తి పాల్గొన్నారు

ఇంకా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్పర్సన్ లావణ్యరెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఏవో పరశురామ్ నాయక్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ మున్సిపల్ ఛైర్మన్ టి.చంద్రపాల్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమిషనర్ శ్రీహరి,  కౌన్సిలర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి పువ్వాడను కలిసిన హరికృష్ణ

Bhavani

అర్నబ్ గోస్వామిపై రూ.200 కోట్ల పరువునష్టం

Satyam NEWS

ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల

Satyam NEWS

Leave a Comment