సాధారణంగా గుడి లో దొరికే ప్రసాదాలు లడ్డూ, పొంగలి, పులిహోర.దద్దోజనం,శొండేలు కానీ సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా తమిళనాడులోని మదురైలో మునియాండి స్వామి దేవాలయం లో ప్రసాదాలుగా చికెన్బిర్యానీ, మటన్ బిర్యానీ పంపిణీ చేయడం చేస్తారు.ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వార్షిక ఉత్సవాల్లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు బిర్యానీని పంచుతారు.
ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కేజీల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లను ఉపయోగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏమాత్రం వివక్ష చూపకుండా ఈ బిర్యానీ ప్రసాదాన్ని అందజేస్తారు. బిర్యానీని ఇంటికి పార్శల్ తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఈ బిర్యాని ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సైతం అందజేస్తుంటారు. 84 ఏళ్లుగా బిర్యానీని ప్రసాదంగా పంచే సంప్రదాయం కొనసాగుతుంది.ఏదైమైనా రోజు ఇలాంటి ప్రసాదాలు పెడితే ఆ గుళ్ళు కూడా ఫుల్ గా జనం తో నిండిపోవడం కాయం.