33.7 C
Hyderabad
April 29, 2024 01: 18 AM
Slider జాతీయం

క్రో బిర్యానీ:కాకులను చంపి చికెన్ బిర్యానీలోకలిపి

tamilanadu crow biryani

తమిళనాడులో చికెన్ బిర్యానీ పేరుతో కాకి మాంసాన్నిభోజన ప్రియులకు అంటగడుతున్న వైనాన్ని అక్కడి పోలీసులు బయట పెట్టారు.తమిళనాడు రామేశ్వరంలో ఓ దేవాలయంలో భక్తులు వేసిన బియ్యం తిని కాకులు చనిపోతున్నాయి. కాకులు చనిపోవడాన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దేవాలయం పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు.

ఆ సమయంలో ఆ దేవలయానికి వచ్చిన ఓ వ్యక్తి కాకులకు బియ్యం చల్లి, అవి స్పృహ కోల్పోయిన తరువాత వాటిని తీసుకెళ్లడాన్ని పోలీసులు గమనించారు. బియ్యం చల్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుడి ఆవరణలో కాకులకు చల్లుతున్న బియాన్ని మత్తు మందు కలుపుతున్నామని, ఆ బియ్యం తిన్న కాకులు స్పృహకోల్పోతున్నాయని చెప్పాడు. మత్తులో ఉన్న కాకులను తీసుకెళ్లి వాటి మాంసంతో బిర్యానీ చేస్తున్నట్లు, పలు హోటళ్లలో నాన్ వెజ్ ఐటమ్స్ లో కలుపుతున్నట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

Murali Krishna

హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లంపై త‌గిన ఆధారాల‌తో సిద్ధంకండి

Satyam NEWS

ఆకట్టుకునే కథనంతో సాగిన లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ “నేనెవరు”

Satyam NEWS

Leave a Comment