గత రెండు రోజులుగా అక్రమంగా తరలిస్తున్న 30 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) అధికారులు. చెన్నై,హైదరాబాద్,విజయవాడ, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఈ బంగారాన్ని అధికారులు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 13.3 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న 12 మంది స్మగ్లర్లను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఈ ముఠా చెన్నై నుంచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్లో ఉన్న స్మగ్లింగ్ ముఠాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.