జీహెచ్ఎంసి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఘనవిజయం సాధించే దిశగా నడిపించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బిజెపి మైనారిటీ మోర్చా నాయకుడు రహ్మతుల్లా ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ ప్రజలకు భారతీయ జనతా పార్టీపై విశ్వాసం కలిగించడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయం సాధించారని ఈ సందర్భంగా రహ్మతుల్లా అన్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసి తర్వాత అన్ని ఎన్నికలలో గెలిచే విధంగా వ్యూహం రచించే శక్తియుక్తులు బండి సంజయ్ కు ఉన్నాయని ఆయన అన్నారు.
బిజెపి సారధిగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ వివిధ ప్రముఖ దేవాలయాల నుంచి వేదపండితులను తీసుకుని వచ్చిన రహ్మతుల్లా బండి సంజయ్ కు ఆశీర్వాదం ఇప్పించారు.