బాధిత కుటుంబానికి చేయూతనందించి సహృదయాన్ని చాటుకున్నారు ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మామిడి సారయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తస్లీమా శుక్రవారం వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి, ఫోటోకి నివాళులు అర్పించి, ఓదార్చారు. కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరం అని వారి లేని లోటు మరి ఎవరు తీర్చలేరని అన్నారు. సర్వర్ ఛారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించారు. ఇలాంటి సందర్భాలలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులలో ధైర్యాన్ని నింపారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు, తదితరులు ఉన్నారు.
previous post