సంగీతానికి నెలవైన విజయనగరంలో దాదాపు ..11 నెలల తర్వాత ఓ సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది…..ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్.
నగరంలో శంకరమఠం వేదికగా…సద్గురు త్యాగరాజ ఆరాధన ఉత్సవం నిర్వహిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి మండపాక రవి తెలిపారు.
ఫిబ్రవరి 1,2 తేదీలలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని..ఈ ఉత్సవాలను సంగీత కళాశాల ప్రిన్సిపల్ అనూరాద ప్రారంభిస్తారని తెలిపారు.
తొలిరోజు ప్రముఖ విద్వాంసులచే కార్యక్రమాలు ఉంటాయని, రెండో రోజు వర్ధమాన సంగీత కళాకారులచే సంగీతం ఉంటున్నారు.
కరోనా మూలంగా ప్రతీ ఒక్కరూ సోషల్ డిస్టన్స్ పాటించడం, మాస్క్ ధరించడం ,శానిటైజర్ వాడటం వంటి మూడు అంశాలను పాటించాలని ఈ సందర్బంగా సంస్థ కార్యదర్శి రవి కోరారు.