కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఆంధ్రప్రదేశ్లో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతుంది.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.