చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల్లోని టీడీపీ కుటుంబ సభ్యుల ఇంట విషాదం జరగటంతో టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి పరామర్శించారు.
ముందుగా చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లి పంచాయతీ మటంపల్లికి చెందిన శంకర్ రెడ్డి మరణించటంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆ తరువాత ఎ.రంగంపేట టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూపతి సమీప బందువు మల్లెల హేమంత్ ఆకస్మిక మరణం చెందటంతో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించారు.
తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు పంచాయతీ కొత్తూరులో కిలారి భారతమ్మ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.