ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో కలెక్టర్ మారిన గుంటూరు జిల్లాలో పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
తొలి విడత ఎన్నికల సిబ్బందికి కలెక్టరేట్ లో నేడు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ శిక్షణ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
తెనాలి డివిజన్ పరిధిలోని స్టేజ్-1 అధికారులు శిక్షణ ప్రారంభమైందని దినేష్ కుమార్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
శాంతిభద్రతల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడేది లేదని ఆయన అన్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యం న్యూస్, గుంటూరు జిల్లా