29.7 C
Hyderabad
May 3, 2024 03: 23 AM
Slider ముఖ్యంశాలు

చిల్లర మాటలు వద్దు.. గతంలో చీరల కొట్లో పనిచేశారా?

#VangalapudiAnitha

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అమరావతి రైతులను చిన్నచూపు చూడొద్దని తెలుగు మహిళ నాయకురాలు వంగలపూడి అనిత హితవు పలికారు.

రైతు ఇలాగే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాపకం కోసం వేరే మార్గం చూసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డికి ఆమె హితవు పలికారు.

అమరావతిలో మహిళలు 50 వేల రూపాయల చీరలు కట్టుకుని దీక్షలో పాల్గొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ అనిత ఆరోపించారు. దీనిపై ఆమె మండిపడ్డారు.

“విష్ణురెడ్డి గారూ… మీరు అంత కచ్చితంగా చీరల రేట్లు చెబుతున్నారు… గతంలో మీరేమైనా చీరల కొట్లో పనిచేశారా? రైతు అంటే ఇలాగే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? రైతులంటే అంత చిన్నచూపు దేనికి?

జగన్ రెడ్డి గారి ప్రాపకం కావాలంటే మరో మార్గం వెతుక్కోండి, అంతే తప్ప ఇలా చీరలు, చొక్కాలు అంటూ చిల్లర మాటలు మాట్లాడొద్దు” అని హెచ్చరించారు.

Related posts

హానర్: జూన్ 2న జెండా ఎగరేసేది వీరే

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS

చైనాలో కరోనా విస్పోటనం: రోడ్డు పక్కనే చికిత్స

Satyam NEWS

Leave a Comment