కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినాక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ఏ మాత్రం అభివృద్ధి చేశారో అన్నదానిపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అభివృద్ధిపై చర్చించకుండా చోటామోటా నాయకులతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బత్యాల చంగలరాయుడిపై వ్యక్తిగత విమర్శలకు దిగటం తగదని వారు అన్నారు.
గత ప్రభుత్వం తెలుగుదేశం లో ఎమ్మెల్యేగా పదవులు అనుభవించి రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం 878 కోట్లు రూపాయలను అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారని అలాంటి పార్టీని గంజాయి వనం అంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. వైసిపి తులసి వనం అయితే ఎంత మాత్రం ఈ మూడు సంవత్సరాలు నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టారని ఘాటైన వ్యాఖ్యలు విమర్శించారు. ప్రజల సొమ్మును ఖర్చు పెట్టడంలో ఏ వ్యక్తి సొంత నిధులు కావని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఒంటిమిట్ట చెరుకు నీరు, కోదండరామ స్వామి ఆలయ విశిష్టత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయినప్పటికీ నియోజవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. భత్యాల ను విమర్శించే స్థాయి వారికి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు టిఎన్ఎస్ఎఫ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు వేణుగోపాల్, ఈడిమడకల కుమార్, ఎస్ సి జిల్లా నేత మందా శ్రీనివాసులు, రాంనగర్ ఆర్ నరసింహలు పాల్గొన్నారు.