రాజా రవీంద్ర, మనో, శ్రీముఖి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం క్రేజీ అంకుల్స్.
ఈ.సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ ఫ్రండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి క్రేజీ అంకుల్స్ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యానికి రఘు కుంచె స్వరాలు సమకూర్చగా లిప్సిక ఆలపించారు.
ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ ముగ్గురు మధ్య వయస్కులు ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపొందింది.
ఈ కథ ఆద్యంతం హాస్యంతో నవ్విస్తుంది. వ్యంగ్యం, వినోదం కలబోసిన సినిమా ఇది అని చెప్పారు.