కడపజిల్లా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు డిమాండ్లను సాధించేందుకు సాధన దీక్షను చేపట్టినారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోన మహమ్మారి వలన ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన “సాధన దీక్ష”కు సంఘీభావంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు.