రైతు సమస్యలను విస్మరించిన టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మాజీ రాజ్యసభ సభ్యులు వి .హనుమంత రావు అంబర్ పేట లోని తన నివాసంలో ఒకరోజు నిరాహారదీక్ష చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రథసారథి ఎల్ రమణ ఆదేశాల మేరకు అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బిల్డర్ ప్రవీణ్ తన సహచర నాయకులతో హనుమంతరావు ఇంటికి వెళ్లి పూలమాలవేసి దీక్షకు మద్దతు తెలిపి నిరాహార దీక్ష విరమింప చేసేవరకు అక్కడే ఉన్నారు.
ఈ సందర్భంగా బిల్డర్ ప్రవీణ్ మాట్లాడుతూ మా రథసారథి ఆదేశాలను శిరసా వహిస్తూ హనుమంత రావు కు మద్దతు తెలిపామని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్న ఎవరికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.