33.7 C
Hyderabad
April 30, 2024 00: 56 AM
Slider నల్గొండ

ఇంటింటికి సరుకులను పంపిణి చేసిన శ్రీపతి

#Sripathi Chemicals

తమ పరిశ్రమకు స్థానం కల్పించిన గ్రామంలోని ఇంటింటికి సరుకులను పంపిణి చేసి ఉదారత్వాన్ని చాటుకుంది ఒక కెమికల్ పరిశ్రమ యాజమాన్యం. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లోని చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీపతి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కరోనా కరువు నేపథ్యంలో గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో గ్రామంలో ఉన్న సుమారు 1100 కుటుంబాలకు నిత్యావసర సరుకులను గురువారం అందజేశారు.

2 కిలోల గోధుమమపిండి, అరకిలో కందిపప్పు, అరకిలో నూనె, 10 బిస్కట్ ప్యాకెట్లు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రత్నం పుష్ప నర్సిహ్మ, ఫ్యాక్టరీ ప్రతినిధి జోషి ఉన్నారు. చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి 1000 పొప్పడి పండ్లను పేదలకు పంచి పెట్టారు. బీహార్ రాష్ట్రం నుండి వచ్చిన వలస కూలీలకు 4వ వార్డు కౌన్సిలర్ జమాండ్ల జయమ్మ శ్రీనివాసరెడ్డి బియ్యం,  ఇతర సరుకులు పంపిణీ చేశారు.

Related posts

ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

చర్చలు జరపాల్సిందే: డేటు, టైము ఫిక్స్

Satyam NEWS

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారుకు అశ్రునివాళి

Satyam NEWS

Leave a Comment