37.7 C
Hyderabad
May 4, 2024 14: 21 PM
Slider చిత్తూరు

కుప్పంలో వైకాపా కుప్పిగంతులు: అది అడ్డగోలు గెలుపు

#SudhakarReddy15

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూపంలో రాజీనామా చేసి పోటిచేస్తే  ఒడిస్తామని  వైకాపా నేతలు అనడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉందని  రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. దమ్ముంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి చేత  రాజీనామా చేయించి పులివెందులలో తేల్చుకోవాలని సవాలు విసిరారు. టిడిపి బహిష్కరించిన  పరిషత్ ఎన్నికల్లో అడ్డగోలుగా సాధించిన గెలుపు చూసి విర్రవీగడం తగదని హితవు పలికారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించడం వై ఎస్ రాజశేఖర రెడ్డికే సాధ్యం కాలేదని, ఇక జగన్ చేసేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. వైకాపా నేతలు ముందున్న ముసళ్ల పండుగను గుర్తించ లేక పోతున్నారని చెప్పారు. వైకాపాకు ఎదురు లేదని నిరూపించుకోవాలంటే  జగన్ రాజీనామా చేసి గెలిచి చూపించాలన్నారు. పులివెందులలో జగన్ పై పోటీచేసి ఓడించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు.

బూతుల మంత్రి కొడాలి నాని రాజీనామా చేసినా తాను పోటీ చేసి డిపాజిట్ రాకుండా  ఒడిస్తానన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, రోజా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి  లేదా మరొకరు రాజీనామా చేసినా ఓడించడానికి తాను సిద్దమేనని అన్నారు. ఇకనైనా వైకాపా నేతలు సొల్లు మాటలు మానాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా  ప్రజలే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేయడానికి అందరూ ఎదురు చూస్తున్నారని సుధాకర్ రెడ్డి చెప్పారు.

Related posts

నేటి యువకులే నేటి నవభారత నిర్మాతలు

Satyam NEWS

వేద పాఠశాలలో రెపరెప లాడిన మువ్వన్నెల జాతీయ జెండా

Satyam NEWS

కోడెల మెడ చుట్టూ తాడు గుర్తులు?

Satyam NEWS

Leave a Comment