29.7 C
Hyderabad
April 29, 2024 08: 11 AM
Slider మహబూబ్ నగర్

మహాధర్నాకు వెళుతున్న ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు

#kollapurpolice

317 జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నున్నధర్నా చౌక్ లో జరగనున్న మహాధర్నా కార్యక్రమానికి వెళ్తున్న ఉపాధ్యాయులను నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. స్థానికతకు ప్రాధాన్యం లేని ఆ జీవోను రద్దు చేయాలని గత కొంత కాలంగా ఉపాధ్యాయులు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ జీవో కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించాలని తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS)  రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది.

ఈ మేరకు కొల్లాపూర్ నుంచి బయలుదేరిన ఉపాధ్యాయులు ఎస్.రాజవర్ధన్ రెడ్డి, పి సతీష్, జి. కృష్ణ, కె నరేందర్ రెడ్డి లను కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయం5.30 నిమిషాలకు పోలీసులు నిర్బంధించారు. బాధ చెప్పుకుందమంటే… బంధించి కూర్చోబెడుతున్నారని, విషయం మాట్లాడుకుందమంటే అరెస్ట్ లతో వికృత చేష్టలు చేస్తున్నారని ఈ సందర్భంగా టీచర్లు వాపోయారు. పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో హక్కుల ఆక్రందన వినిపిస్తున్నదని వారు తెలిపారు.

Related posts

క‌మ‌లం వీడి కారెక్కిన బీజేపీ నేత‌

Bhavani

గుర‌జాడ  ఆడిటోరియం…మ్యూజీయం సంగ‌తేంటి..?

Satyam NEWS

అమరావతి రైతుల డిమాండ్ ను అపహాస్యం చేసిన సీఎం జగన్

Satyam NEWS

Leave a Comment