దళిత బంధు పథకంలో తమ పేరు ఉండాలనే స్వార్ధంతో కొందరు వ్యక్తులు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు డీకే మాదిగ అన్నారు. అవతలి వ్యక్తి ఎంత బలవంతుడైనా తప్పు చేస్తే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. చుక్కాయిపల్లి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు.
కేవలం దళిత బందు కోసం ఎందుకు ఈ పాకులాట అని ఆయన ప్రశ్నించారు. ఉదయం లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటాం కాబట్టి, అనవసరంగా మాట్లాడి అభాసు పాలు కాగండి అని ఆయన హితవు పలికారు. ఏ నాయకుడు ఏ తప్పు చేశారు, అన్నవి రేపు రాబోయే ఎలక్షన్ లో, ప్రజలే వారికి గుణపాఠం చెబుతారన్నారు. ఏవైనా తెలుసుకొని మాట్లాడితే కొల్లాపూర్ నియోజక వర్గ గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.