గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎం. అమ్మిరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయడాన్ని కులపిచ్చికి బదిలీ శిక్షగా భావించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అమ్మిరెడ్డి వైసీపీ కార్యకర్త లాగా పనిచేశారని, కొందరు జర్నలిస్టులతో మాట్లాడనంటూ తూలనాడారని గుర్తు చేశారు.
ఎంపీ రఘు రామకృష్టంరాజు అరెస్టు తరువాత ఆర్మీ హాస్పటల్లో చికిత్స చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత ఆయనను మళ్లీ అరెస్టు చేయడానికి ఎస్పీ అమ్మిరెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు.
ఆయన టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్మీహాస్పటల్ రిజిస్ట్రార్ కె.పి.రెడ్డి కుట్ర పన్నారని రఘురామకృష్ణంరాజు కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ కు ఫిర్యాదు చేశారన్నారు.
దీంతో ప్రభుత్వానికి అమ్మిరెడ్డిని బదిలీ చేసి వి ఆర్ కు పంపక తప్పలేదన్నారు. అలాగే గత స్థానిక ఎన్నికల్లో ఏక పక్షముగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి బదిలీ వేటుకు గురయ్యారని చెప్పారు.
కాగా కర్నూలులో ఒక సి ఐ ముస్లిం కుటుంబాన్ని వేధించి కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకుని చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే తగిన మూల్యం చెల్లింసుకోక తప్పదని అధికారులు గుర్తించాలని అయన హితవు పలికారు.
చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెట్టే వారిపై కేసులు పెట్టడానికి టిడిపి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. తీరు మారని అధికారులకు టిడిపి అధికారంలోకి శిక్షలు తప్పవని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.