తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి ర్యాలీ కార్యక్రమాల్లో బాగంగా కరీంనగర్ అమరవీరుల స్థూపం నుండి నియోజకవర్గ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అశేష జనవాహినితో కలిసి ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా తరలివచ్చి జాతీయ సమైక్యతా దినోత్సవ స్పూర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మున్సిఫల్ మేయర్ సునీల్ రావు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, హాజరైన వివిధ సంఘాలు కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.