27.7 C
Hyderabad
April 30, 2024 08: 00 AM
Slider నల్గొండ

ప్రజా సమస్యలపై ఇంటింటికి తెలుగుదేశం

#jitdp

ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసమే కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు మండవ వెంకటేశ్వర్లు తెలిపారు. 

మంగళవారం హుజూర్ నగర్ పట్టణం లోని మిర్యాలగూడ రోడ్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించి, టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కి పార్టీ సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి స్పందన ఉన్నదని,తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర గణనీయమైనదని, అందుకే పేద ప్రజల హృదయాలలో తెలుగుదేశం పార్టీ ఉన్నదని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వ నమోదులో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ పార్టీ కన్వీనర్ కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్,తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చల్లా వంశీ, బిసి సెల్ రాష్ట్ర నాయకుడు గుండు వెంకటేశ్వర్లు గౌడ్,తెలుగు మహిళా పార్లమెంటు నాయకురాలు సాముల కోటమ్మ,సావిత్రి,అశోక్,సాధనాల రాములు, అంజయ్య,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

బిజెపికి బలం లేకపోతే ఇంత మంది ఎందుకు వచ్చారు?

Satyam NEWS

నడక…నడక…

Satyam NEWS

చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయూత

Satyam NEWS

Leave a Comment