కడప జిల్లా లో సెక్యురిటి లేని 12 దేవాలయాలలోని హుండీలను పగులగొట్టి దోచుకుంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు అనే వ్యక్తి ఇర్కాన్ సర్కిల్ వద్ద వాహన తనిఖి చేస్తుండగా పొలీసులను చూసి పారిపోయెందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు పట్టుకుని విచారించారు.
దాంతో అతను జిల్లా లోని పలు దేవాలయల్లొ దొంగతనం చేశానని తనకు ఇంకొకరు సహకరించారని చెప్పాడు. అతని వద్ద వద్ద నుండి 21317 రుపాయల నగదు, ఒక బైక్, ఇనుపరాడ్ స్వాధీనం పరుచుకున్నామని పోలీసులు తెలిపారు. మరో ముద్దాయి వేణు గోపాల్ పరారీలో ఉన్నాడని కడప జిల్లా డియస్పి సూర్యనారాయణ తెలిపారు.