రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచిన పిల్లలమర్రి శివాలయాలు కార్తీక దీపాల వెలుగులో శోభాయమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం ఉదయం వరకు కార్తీక పౌర్ణమి కొనసాగడంతో భక్తులు దేవాలయాల్లో నూనె దీపాలను వెలిగించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ ఆవరణంలో డమరుకం, స్వస్తిక్, ఓం కారం, నక్షత్రంతో పాటు పలు ఆకారాలలో భక్తులు దీపాలు వెలిగించారు. పట్టణం నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గ్రామంలోని వీదులన్ని రద్దీగా మారాయి.