తిరుమల శ్రీవారిని దాదాపు 400 మంది అంధ విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులు తమ దివ్యనేత్రాలతో దర్శనం చేసుకుని ఆనంద పరవశులయ్యారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరు తిరుమలకు చేరుకున్నరు. వీరికి టిటిిడి అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వారు పొందిన దివ్యానుభూతికి ఆనందం వ్యక్తం చేశారు. దర్శన ఏర్పాట్లు చేసిన టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
previous post