30.7 C
Hyderabad
April 29, 2024 05: 12 AM
Slider విజయనగరం

ప్రజాహిత కార్యక్రమాలకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది

#YSR Congress Party

ప్రజాహిత కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టి , సమాజ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.. గాజుల రే గకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జామాన శ్రీనివాసరావు తన జన్మదినాన్ని పురస్కరించుకుని సొంత నిధులతో వందమంది బాక్సింగ్ క్రీడాకారులకు టీ షర్ట్ లను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చేతుల మీదుగా అందజేశారు. క్రీడాకారులు, గాజుల రేగ పార్టీ నాయకులు సమక్షంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల జామాన శ్రీనివాసరావు చేత కేక్ కట్ చేయించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాహిత కార్యక్రమాల పట్ల ఎప్పుడు ముందుంటారని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో, వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బాక్సింగ్ క్రీడ బనియన్లను క్రీడాకారులకు అందజేస్తానని జామాన శ్రీనివాసరావు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమన్నారు.

ఎవరైనా తమ పుట్టినరోజులకు వృధాగా డబ్బు ఖర్చు పెట్టే కంటే, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నగర మేయర్ శ్రీమతి వెంపటాపు విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజం గురించి ఆలోచించి , తన పుట్టినరోజు నాడు శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతైనా అభినందనీయమన్నారు. సీఎం జగన్ విద్యకు, క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జామాన శ్రీనివాసరావు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్ఫూర్తితో తన జన్మదినం రోజు న క్రీడాకారులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలకు తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు డోలా మన్మధ కుమార్, కార్పొరేటర్లు నడిపెల్లి ఆదినారాయణ, పట్టా ఆదిలక్ష్మి, గాజులరేగ పిఎసిఎస్ అధ్యక్షులు జమ్మ మధు, పార్టీ నాయకులు కనుగుల రాజా, ఎస్,ఎన్. తదితరులు ఉన్నారు.

Related posts

ఏపీ రాజధాని అంశంపై అక్టోబర్‌ 5 వరకు స్టేటస్‌కో

Satyam NEWS

మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్

Bhavani

కంకులు కొన్న కవిత

Bhavani

Leave a Comment