అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన అబ్దుల్లా, జహిరున్నీసా దంపతులకు ముగ్గురు సంతానం. జహి రున్నీసా భర్త ను వదిలేసి నంద్యాల జిల్లా చాగలమర్రి కి చెందిన లక్ష్మణ్ తో సహజీవనం చేస్తోంది.ఈ క్రమంలో ఇద్దరు పిల్లలను మదరసాలో ఉంచి చదివిస్తోంది.
చిన్నవాడైన షాహిద్ (10)కు మాటలు రాకపోవడంతో వారి వద్దనే ఉంటున్నాడు.కాగా కొడుకు షాహిద్ తో కలిసి ప్రియుడు లక్ష్మణ్ వద్దకు జహిరున్నీసా వెళ్ళింది.వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో మూగ వాడైన షాహిద్(10) ప్రియుడు లక్ష్మణ్ ఇష్టానుసారంగా కొట్టినట్టు తెలిసింది.
దీనితో బలమైన బలమైన గాయాలతో చిన్నారి షాహిద్ మృతి చెందాడు.కాగా ప్రియుడు లక్ష్మణ్ ను చాగల మర్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నంద్యాల జిల్లా చాగలమర్రిలో చనిపోయిన బాలుడు మృతదేహాన్నీ కర్నూల్ లో పంచనామా జరిపి, అన్నమయ్య జిల్లా నందలూరు లోని స్వగృహంకు తల్లీ తీసుకు వచ్చింది.
ప్రియుడు కొట్టగా గాయాలతో కొడుకు మృతి చెందినట్టు తల్లీ జహిరున్నీసా చెప్పింది.తన సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడన్న నెపంతో గతంలో తల్లి జహిరున్నీసా కుమారుడు షాషిద్ కాళ్లు, చేతులకు వాతలు పెట్టి, ముఖంపై రక్కి, చిత్ర హింసలకు గురి చేసి ఇంటి నుంచి గెంటేసినట్టు తెలిసింది.
షాహిద్ గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రం వద్ద దుస్తులు లేకుండా నడవలేని పరిస్థితిలో ఉండగా, స్థానిక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మహేశ్వరబాబు గమ నించి అతడికి ప్రథమ చికిత్స చేయించి, భోజనం పెట్టి, దుస్తులు సమకూర్చి స్థానిక పోలీ సులకు సమాచారం అందించగా, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపి వేయగా ఇప్పుడు ఏకంగా షాహిద్ ను ప్రియుడు లక్ష్మణ్ హత మార్చడం చర్చనీయాంశంగా మారింది.తమ ముందు అమాయకంగా తిరుగాడిన షాహిద్ ను కొట్టి చంపారనే వార్త గ్రామంలో విషాదం నింపింది.