తెలంగాణ రాష్ట్ర ప్రగతి చిహ్నం Dr. Br అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో వైభవోపేతంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దేవాలయం, మసీద్, చర్చి లు ప్రారంభించరు. కార్యక్రమంలో కేసీఅర్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పలువురు అధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు పలువురు హాజరైయ్యారు.
సచివాలయం ప్రాంగణంలో చర్చ్ నందు పాస్టర్స్ కమిటీ అధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభించరు. గుడిలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. అనంతరం మజీద్ లో ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించారు. అనంతరం గవర్నర్ ను కెసిఆర్ సన్మానించారు.