గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం లోని వెల్లటూరు వేణుగోపాల స్వామి ఆలయం లో కలశం చోరీకి గురైంది. గుడి శిఖరం పై ఉన్న పంచ లోహాలతో తయారు చేసిన కలశాన్ని దుండగులు చోరీ చేశారు. ఈ కలశం మూడు వందల సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి చక్రపాణి కంఠంరాజు శివరామ యోగేశ్వరరావు అన్నారు. గతంలో ఈ ఆలయంలో ఎన్నడూ దొంగతనాలు జరగలేదని ఆయన తెలిపారు. వేణుగోపాల స్వామి ఆలయం శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మితమైనదని, దీనికి ఎంతో క్షేత్ర ప్రాధాన్యత ఉన్నదని ఆయన తెలిపారు. ఆలయ శిఖరం చోరీకి గురికావడంతో ఎలాంటి అరిష్టం దాపురిస్తుందోనని గ్రామస్తులంతా భయాందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు.
previous post