బహిరంగ సభలు, సమావేశాలు, శుభకార్యాలలో జేబు దొంగల హల్చల్ అంతాఇంతా కాదు. జేబులో డబ్బులు కనపడితే క్షణాల్లో మాయం చేస్తారు కేటుగాళ్ళు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైఎస్ ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్తానం పాదయాత్రలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ ఘటన ఆలస్యంగా బయటకు పొక్కింది. పాదయాత్ర చేస్తుండగా ఓ వ్యక్తి జేబులో నుంచి 5 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగను పోలీసులు విచారించగా పాదయాత్రలో ఓ ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్టు వెల్లడించినట్టుగా సమాచారం.
previous post