40.2 C
Hyderabad
April 28, 2024 15: 37 PM
Slider కర్నూలు

మహిళా ఎస్సైకి  వైసీపీ నాయకుడి బెదిరింపులు

‘నన్నే స్టేషన్‌కు రమ్మని పిలుస్తావా? నీ అంతు చూస్తా’ అంటూ ఓ వైసీపీ నేత మహిళా ఎస్‌సైపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన సంఘటన నంద్యాలలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ నెల 25న స్పందన కార్యక్రమంలో వైవీ రాజేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఓ స్థలం కబ్జా విషయమై ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నంద్యాల త్రీ టౌన్‌ ఎస్‌ఐ నగినా.. వైసీపీ నాయకుడు గోపవరం సాయినాథ్‌రెడ్డికి ఫోన్‌ చేశారు.

దీంతో సదరు నాయకుడు తీవ్రంగా స్పందించారు. నన్నే స్టేషన్‌కు రమ్మని పిలుస్తావా? నీ అంతు చూస్తానంటూ తిట్ల దండకం అందుకున్నారు. ‘నా భార్య లాయర్‌.. నా తండ్రి ఓ క్రిమినల్‌ లాయర్‌. నాకు రాజకీయ పలుకుబడి ఉంది. గతంలో నన్ను స్టేషన్‌కు పిలిపించిన ఓ డీఎస్పీపై హైకోర్టులో ఫిటిషన్‌ వేసి ముప్పుతిప్పలు పెట్టాను. నన్నే స్టేషన్‌కు రమ్మంటావా..’ అంటూ బయటకు చెప్పుకోలేని బూతులు తిట్టాడని ఎస్‌ఐ ఆవేదన చెందినట్టు సమాచారం.

దీంతో ఆమె తీవ్ర మనస్తాపంతో పోలీసు ఉన్నతాధికారుల ముందు కన్నీటి పర్యంతమైనట్టు తెలిసింది. మహిళనని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టాడని, తన విధులకు ఆటంకం కలిగించాడని పేర్కొం టూ.. ఆమె సీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాయినాథ్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related posts

రైతులకు ఉచితంగా శానిటిజర్ ల పంపిణీ

Satyam NEWS

వాట్సాప్ ద్వారా ఐఐటీ -జేఈఈ ఫోరమ్ బుక్ లెట్

Satyam NEWS

విక్టరీ‌ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్‌తో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ‘క్రాక్‌’

Satyam NEWS

Leave a Comment